Tuesday, July 9, 2013

ఆరోగ్యంగా జీవించండీ. ఆధ్యాత్మికంగా ఎదగండి.

ఆరోగ్య సూత్రములు 

ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యము అతను ఆరోగ్యము పట్ల తీసుకొను శ్రద్ధపై ఆదారపడి వుంటుంది. ప్రాణాయామము, ధ్యానములకు పరిపూరకముగా ఇచ్చుట శారీరక, మానసిక ఉన్నతికొరకు కొన్ని ఆరోగ్య సూచనలు తెలియజేయబడినది.

  1. అన్ని ఋతువులు నందు స్వచ్చమైన నీరును పీలైనంత ఎక్కువగా ఏమరుపాటు లేకుండా త్రాగండి. నీరు నిజమైన సంజీవని. నీరును బాగుగా తీసుకొనట్లైతే ఆ నీరు రక్తమును పలచన చేసి రక్తనాళములలోనికి రక్తమును సరళముగా ప్రవహింప చేయును. మరియు శరీరములో జరుగు అనేక ప్రక్రియల వల్ల ఉత్పన్నమైన వేడిని బయటకు పంపివేసి శరీరమును చల్లబరుస్తుంది. ఏ విధముగానంటే కారు రేడియేటర్లోని నీరు ఏ విధంగా కారు యంత్రమును చల్లబరుచునో అదే విధముగా మనము త్రాగే నీరు మన శరీరమును చల్లగా వుంచుతుంది.
  2. మనము త్రాగే నీరు శరీరములో మిగిలిన మలిన పదార్థములను వెలుపలికి పంపిచేసి శరీరమును ఆరోగ్యముగా, శుభ్రముగా ఉంచుతుంది. శారీరక అనారోగ్యమునకు, అన్ని వ్యాధులకు మూలకారణము ఈ మలిన పదార్థములే. నీరు వీతిని శుభ్ర పరస్తుంది, కావున నీరు త్రాగడం ఒక అలవాటుగా చెసుకోండి. నిద్రపోవుటకు అరగంట ముంది ఒక గ్లాసినిండా నీటిని త్రాగండి. మనము పడుకొన్న తరువాత తిన్న ఆహారము జీర్ణమై దాని సారము రక్తములో చేరి రక్తమును మందము చేయను. ఈ రక్తము మందముగా, జిగురుగా తయారై నందువలన గుండె మామూలుకన్నా ఎక్కువ ఒత్తిడికి గురై పని చేయవలసివస్తుంది. ఈ కారణముచేతనే మధ్యవయస్సులోని వ్యక్తులు, ముసలి తనములోని వ్యక్తులు రాత్రిపూట నిద్రలో గ్ండెపోటుకు గురి అవడ్ం సహజముగా జరుగుతున్నది. కావున రాత్రి నిద్రకు ముందు నీరు త్రాగడం వలన రక్తము పలుచబడి గుండె పై వత్తిడి తగ్గుతుంది మరియు శరీరమును చల్లబరచి మంచి నిద్ర రావాడానికి దోహదమవుతుంది. కావున అన్ని కాలముల యందు నీరు త్రాగడం మంచి అలవాటు.
  3. అల్పాహరమునకు లేక భోజనమునకు ముందు ఒక గ్లాసు నీటిని త్రాగినత్లైతే ఆ నీరు కడుపులో పేరుకొని ఉన్న వాయువును (గ్యాస్) బయటకు పంపిచేయును. మరియు తక్కువ తినునట్లు చెయును. స్థూలకాయమును తగ్గించుకొనుటకు భోజనమునకు ముందు నీరు త్రాగడం మంచి ఉపాయము
    అతి ప్రాచీన వైద్య పద్దతి అయిన ఆయుర్వేదము ప్రకారము మట్టి మూకుడు, మట్టిపాత్రలలో వుంచిన నీరును త్రాగినత్లైతే ఆ నీరు మంచి ఆరోగ్యమును ఇచ్చును. ఎందువలననగా ముట్టి పాత్రలకు నీరులో ఉన్న అనవసరపు అయస్కాంత త్రరంగములుగాని విద్యత్ తరంగములుగాని ఉన్నచో అటువంటి వాటిని తనలోనికి ఇముడ్చుకొని స్వచ్చమైన నీటిని మనకు అందించు తత్త్వమును కలిగియున్నవి.
  4. మీ అభిరుచికి తగినట్లు భుజించండి. కాని తక్కువ కేలరీలు, ఎక్కువ పేచు పదార్థములు కలిగిన అహారమును భుజించండి.
  5. మంచి విటమున్లు కలిగిన కాయగూరలను భుజించండి. ముఖ్యముగా విటమిన్ -సి మరియు వితమిన్ -ఇ కలిగినవి. ఎందుకంటే విటమిన్ -సి సహజముగా సోకే వ్యాధులు(ఉదా - జలుబు) మైదలైన వాటినుంచి ఎక్కువ రోగనిరోధక శక్తినిచ్చి కాపాడుతుంది మరియు విటమిన్ -ఇ శరీరమును తేజోవంతం చేస్తుంది.
  6. మరియు కాయగూరలు శరీరమునకు తగినంత ఐరన్ను ఇస్తాయి. ఈ ఐరన్ రక్తహీనతను తగ్గించుటయే గాక రక్తములోని హిమోగ్లోబిన్ శాతమును వృద్ధి చేస్తుంది. రక్తములో ఈ హిమోగ్లోబిన్ శాతము తగ్గినంత ఉన్నప్పుడు మాత్రమే రక్తము ఊపిరితిత్తులలో వున్న ప్రాణవాయువు (ఆక్సిజన్)ను గ్రహించి మొదడుకు మరియు శరీర అవయవములకు చేరవేయును. మీరు ధీర్ఘప్రాణాయమము చేయునపుడు రక్తములో తగినంత హిమోగ్లోబిన్ శాతము లేనట్లెతే మెదడుకు మరియు శరీర అవయవములకు తగినంత ప్రాణవాయువు అందదు. అప్పుడు ధీర్ఘప్రాణాయామము తగినంత ఫలితం ఇప్వదు.
  7. మానవ శరీరము పంచభూతములైన పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైన వానితో నిర్మితమై యున్నది. అందులో భూమి, ఆకాశము స్థిరముగా వుంటే మిగిలిన అగ్ని, జలము, వాయువు చరిస్తుంటాయి. శరీరములో చరించే మధ్య అసమతౌల్యమేర్పడినట్లయితే అనేక రోగములకు కారణభూతమౌచున్నదని ఆయుర్వేదము తెలియజేయు చున్నది. త్రిఫల చూర్ణము లేదా మాత్రలు ( ఆయుర్వేద మునకు సంబంధిచిన ఓషదుల మిశ్రమము) ప్రతి దినము ప్రొద్దున పరగడుపున ఒక టే స్పూన్ పొడినిగాని లేదా మాత్రలు గాని నీటితో తీసుకొన్నట్లైతే శరీరములోని అగ్ని, జల, వాయువులను నియంత్రించి అనేక శారీరిక రుగ్మతలనుంచి కాపాడుతుంది.
  8. త్రిఫలా చూర్ణమును లేదా మాత్రలు ప్రతిదినము తీసుకొన్నట్లైతే అది శరీరములోని ఎముకల కదలికలకు సహకరించుటయే గాక శరీరములో అధికముగా వున్న వేడిని తొలగించి అగ్ని(పిత్త), వాయు(వాత), కఫ(జల)లను నియంత్రించి అనేక రుగ్మతలను దూరం చేస్తుంది.
  9. మీరు గనుక సంగీత ప్రీయులైతే మృధు మధురమైన సంగీతమును వినండి. అది మీకు శారీరంగా, మానసికంగా విశ్రాంతిని కలుగజేస్తుంది. రణగొణ శబ్దములతో కూడిన సంగీతము నాడులను ఉద్రేకపరచి శరీరమునకు ఇబ్బంది కలుగజేసి కాలాంతరమందు శరీర అరోగ్యమునకు హానికలిగించును.
  10. ఎల్లప్పుడు అర్థవంతంమైన పుస్తకములను చుదువుచున్నట్లైతే అవి మంచి ఙ్నానమును ఇచ్చుటయే కాక ఉన్నతమైన వ్యక్తిత్వమును కలుగుచేయును.
  11. కొంచెము దానగుణము వృద్ధిచేసుకొన్నట్లైతే అది మనస్సుకు సంతృప్తి కలుగజేస్తుంది. ఈ దానగుణము వలన జీవితమునకు మంచి సార్థకతను ఏర్చరుస్తుంది.
  12. మంచి మరియు సృజనాత్మక ఆలోచనలు (పాజిటివ్ థింకింగ్) మనస్సును ఉన్నతం చేస్తుంది. ఆరోగ్యకరమైన మనస్సు ఆరోగ్యకరమైన శరీరమునకు పునాది వంటింది. ఎందుకంటే మనస్సే శరీరము యొక్క యజమాని కావున. ఉన్నత వ్యక్తిత్వము ఆరోగ్యకరమైన జీవనమునకు చాలా ముఖ్యము. 

 

Wednesday, July 3, 2013

మనోప్రస్థానం: అసలు మీకో రహస్యం తెలుసా?


యోగానికి మనస్సుకు పడదు. రెండూ బద్ద శత్రువులని కాదు. కానీ ఒక ఒరలో ఇమడవు. ఆలోచనల్ని అదుపు చేసి, మనస్సును ప్రశాంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాం. ఎంత ప్రయత్నించినా ఆలోచనలు ఆగవు. పైగా ప్రతి ఆలోచన అవసరమే అనిపిస్తుంది. అసలు మనసు పని ఆలోచనల్ని ఉత్పత్తి చేస్తుండడమే.

వాటంతట అవిగా వచ్చే ఆలోచనలు మనల్ని disturb చేయవు. వాటి వల్ల మనస్సు కలత చెందదు.

మనం అతిగా ఆలోచించినప్పుడే మైండ్ disturb అవుతుంది. సహజంగా ఉత్పత్తి అయే భావాలు మనం కావాలని చేసే ఆలోచనలు కావు. అది నిజానికి ఆలోచించని స్థితి. ఆలోచించడం అనే ప్రక్రియ చిత్తవృత్తి. అది మానసిక ప్రవృత్తి. అది అంతరంగ తరంగం. అంతర్మధనం.

అసలు ఆలోచించడం అంటే ఏమిటి?
మనం ఎందుకు ఆలోచించాలి?
ఎలా ఆలోచించాలి?

మనస్సును పదును పెట్టడం, చైతన్య పరచడం ఆలోచన. అవి మన జ్ఞాపకాలు.

జ్ఞాపక శక్తి ఎక్కువుగా కలవారిని మేధావులు అంటారు. వారిని జ్ఞానులు అనరు. వారు స్వంతంగా ఏమీ ఆలోచించరు. లోపల ఉన్న నిల్వలను బయటకి తీస్తారు.

స్వంతంగా ఆలోచించగల వ్యక్తి పాత వాటిని జ్ఞాపకం పెట్టుకోదు. తాను ఫ్రెష్ గా నిర్ణయాలు చేస్తాడు. కొత్త భావాల్ని ఎప్పటికప్పుడు సృష్టించుకుంటాడు. కొత్త సత్యాలను ఆవిష్కరించుకోగలడు. జ్ఞాపక శక్తిని ' ధారణ ' అనవచ్చు. సత్యావిష్కరణ మనోప్రస్థానం లోనిది.

'జ్ఞానం' కలగాలంటే 'విచారణ' ముఖ్యం. 'ధారణ' అవసరం లేదు. విచారణ వల్ల 'సత్యం' అవగతమవుతుంది. విచారణ సత్యానికి దగ్గరగా తీసుకుపోతుంది.

చాలా మంది అహంకారాన్ని గర్వంగా భావిస్తుంటారు. గర్వం వేరు, అహంకారం వేరు. 'అహం' అన్నది 'నేను' అనే వ్యక్తిత్వ భావన. 'నేను' కు మూలం వెళ్ళితే తప్ప 'అహం' అసలు స్వభావం తెలియదు.

' అహం బ్రహ్మస్మి ' అన్నారు పెద్దలు. ' అహం ' అంటే 'ఆత్మ' అని వారి భావన. 'అహమాత్మ' అని అర్థం. 'నేనే బ్రహ్మం' అన్నాడు అచల గురువు. 'నేను' అంటే అహాన్ని వదిలిన 'ఆత్మ' అని కావచ్చు. అంటే అహానికి రెండు ముఖాలు ఉన్నట్లు అర్ధమవుతుంది.

మన మైండ్ negative గాను, positive గాను పనిచేస్తుంది. Negative మైండ్ అహంకారాన్ని ప్రతిబింబిస్తుంది. Negative మైండ్ లక్షణాలు గర్వం, అహంభావం. Positive మైండ్ లక్షణాలు వినయం, అణుకువ. Negative మైండ్ చెడునే ఆలోచిస్తుంది. చెడునే ఆశ్రయిస్తుంది. పోసివే మైండ్ మంచిని ఆస్వాదిస్తుంది. మంచికి ఆశ్రయం ఇస్తుంది. పైగా అహంకారాన్ని కరిగించి వేస్తుంది. అంటే అవి రెండూ అనుకూల, ప్రతికూల స్పందనలు. 'నో ' అనడం ఎప్పుడూ ప్రతికూలమే. 'ఎస్' అన్నది అనుకూల స్పందన. ప్రతి దానికి ' నో ' అనే వారిలో అహంకారం కొట్ట వచ్చినట్లు కనిపిస్తుంది. మొండితనం దొంగ చూపులు చూస్తుంది. 'ఎస్' అనే వారు అన్నిటికీ సర్దుకు పోగాలుగుతారు. వారిలో ఆహాకారం బొత్తిగా ఉన్నదనిపిస్తుంది.

సత్య యోగ సాధకులు ఎవరైనా సత్య శోధన లక్ష్యం గా ముందుకు సాగుతారు. వార్ సంప్రదాయాని ఖాతరు చేయరు. వారి సాధన, ఆలోచన కొత్తగా సంప్రదాయానికి భిన్నంగా ఉంటుంది. కనుక వారిలో అహంకారం ఉండదు. కొత్త మార్గాన్ని అనుసరించేవారు విజయాని లక్ష్యంగా పెట్టుకుంటారు తప్ప గర్వపడే ప్రసక్తి లేదు.

మనం ద్వంద స్థితిలో ఉంటాం. పాజిటివ్ గా ఉండి అడ్డంకుల్ని తోలిగించుకోవాలని ప్రయత్నిస్తాం. అయినా సమాజం మన కాళ్ళకు బంధాలు వేస్తుంది. ఒక పట్టాన కధలనీయదు. కొన్ని సందర్భాలలో స్వతంత్రించ లేకపోవచ్చు. అయినా మనం స్వేచ్చను వదులుకోలేము. స్వతంత్రిస్తాము. స్వతంత్రంగా వ్యవహరిస్తాం.

చిత్రం ఏమిటంటే అనుకువుగా, వినయంగా ఉండి, పాజిటివ్ గా ఆలోచించగలిగితే ఫలితం ఆలస్యం కావచ్చు కానీ అపజయం ఉండదు. ఎవరేం చెప్పినా 'ఎస్' అని తలూపితే మనలోని 'అహం' చప్పబడి పోతుంది.

'అహంకారం' , 'అస్మితం' అనేవి 'ఈగో' కి రెండు ముఖాలు. 'నేను' ను చేడగోట్టేది అహంకారం. వాస్తవానికి ఆ రెండు గుణాలు మన లోపలివే. 'అస్మిత' లో సాత్వికమైన అహంకారం తొంగిచూస్తుంది. ఒక మహర్షి లోని లేదా మహాయోగి లోని గంభీరతను 'అస్మితం' అనవచు. దానిని 'అహంకారం' గా సామాన్యులు భ్రమపడే అవకాశం ఉంది.